దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ఎస్బీఐ సేవలు

ప్రభుత్వ బ్యాంక్ సంస్థ ఎస్బీఐ సేవలు ఈరోజు మధ్యాహ్నం నుండి నిలిచిపోయాయి. ఎస్బీఐ ఏటిఎం లు , యోనో యాప్, యుపిఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు ఇలా అన్ని కూడా పని చెయ్యక పోవడంతో బ్యాంక్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యమైన లావాదేవీలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. అటు సేవలు ఎప్పుడు పునరద్ధరిస్తామనేది కూడా ఎస్‌బీఐ అధికారులు చెప్పలేకపోతున్నారు. అంతేగాక నెలాఖరు కావడంతో జీతాలు పడే వేళ ఇలా బ్యాంక్‌ సేవలు స్తంభించడంపై ఎస్‌బీఐ శాలరీ అకౌంట్లు ఉన్న ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెయింటెనెన్స్ కారణంగా సర్వీసులకు అంతరాయం కలిగిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఇకపోతే ఎస్‌ఐ 21వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి రెడీ అవుతోంది. దేశ్యాప్తంగా ఉన్న 29 ఆథరైజ్డ్ బ్రాంచుల ద్వారా వీటి జారీ ఉంటుందని ఎస్‌బీఐ వెల్లడించింది. జులై 1 నుంచి జూలై 10 వరకు బాండ్ల జారీ ఉంటుందని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీలకు డొనేషన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. రూ. 1000, రూ. 10 వేలు, రూ. లక్ష, రూ. 10 లక్షలు, రూ. కోటి విలువతో ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. రాజకీయ పార్టీలు ఈ బాండ్లను జారీ చేసిన రోజు నుంచి 15 రోజులలోగా రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ డబ్బులను రాజకీయ పార్టీలు పొందలేవు. వీటిని ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. వ్యక్తి లేదా కంపెనీ ఇలా ఎవరైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.