ఎస్‌బిఐ నుంచి డిజిటల్‌ చెల్లింపులు

కొత్త సంస్థ ఏర్పాటుకు సిద్ధం

SBI
SBI

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ)కి భారీ షాక్‌ ఇవ్వనుంది.

డిజిటల్‌ చెల్లింపుల విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. తద్వారా ఎన్‌పిసిఐ గుత్తాధిపత్యానికి చెక్‌ చెప్పాలని భావిస్తోంది.

అంతేకాకుండా ఇందులో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా భాగస్వామ్యం చేయనుందని తాజా సమాచారం.

దేశీయంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ చెల్లింపుల మార్కెట్లో ప్రాథమిక వాటాదారుగా ప్రవేశించే ప్రణాళికలను ఎస్‌బిఐ సిద్ధం చేసుకుంటోంది.

దీనికి సంబంధించిమొదటి దశ చర్చలు పూర్తి చేసిందని, ఆర్‌బిఐ న్యూ అంబరిల్లా ఎంటిటీ (ఎన్‌ఇయు) ఫ్రేమ్‌వర్క్‌ కింద లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

తను ప్రధాన ప్రమోటర్‌గా, ఇతర ప్రభుత్వ యాజమాన్యం లోని బ్యాంకులతో కన్సార్షియం ఏర్పాటుకు ఆహ్వానిస్తోంది.

గత వారం ఆర్‌బిఐ విడుదల చేసిన నిబంధనల ప్రకారం, డిజిటల్‌ చెల్లింపులకు ఆమోదం పొందిన ఏ కొత్త గొడుగు సంస్థ అయినా ఎన్‌పిసిఐ తరమా అధికారాలను సొంతం చేసుకోవచ్చు.

500 కోట్ల రూపాయల నికర పెట్టుబడి అవసరం. ఇందుకు దరఖాస్తు సమర్పించడానికి జనవరి 2021 గడువుగా నిర్ణయించింది

. ఈ నేపథ్యంలోనే ఎస్‌బిఐ కొత్త వ్యూహ్యాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఆర్‌బిఐ, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో 2008లో ఎన్‌పిసిఐ ఏర్పాటైంది.

దేశవ్యాప్తంగా 60శాతం చెల్లింపులను వాల్యూమ్‌లను ఎన్‌పిసిఐ నియంత్రిస్తుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/