సౌదీలో కొత్తగా 2,378 కేసులు నమోదు
రియాద్: సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ కొనసాగుతుంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 2,378 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,62,772కు చేరింది. కాగా, నిన్న ఒకేరోజు 2,241 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారు 2,15,731 మంది అయ్యారు. ఇక శుక్రవారం సంభవించిన 37 మరణాలతో కలిపి ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,672 మందిని ఈ మహమ్మారి బలిగొంది. అలాగే ప్రస్తుతం దేశంలో 44,369 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 2,143 కేసులు క్రిటికల్ స్టేజ్లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/