ఈ సారి హజ్ యాత్రకు సౌదీ అరేబియా ఆమోదం

హజ్ యాత్రకు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు

రియాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది పలు షరతులతో హజ్ యాత్రకు సౌదీ అరేబియా ఆమోదం తెలిపింది. భారత్ నుంచి 79,237 మందికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతి నిచ్చింది. పరిస్థితుల దృష్ట్యా 65 ఏళ్లకు పైబడిన వారికి హజ్ యాత్రకు అనుమతి నిరాకరించింది.

అంతేకాదు, హజ్ యాత్రకు వచ్చేవారు 2 డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు నిర్ధారణ పత్రం, కరోనా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు వెంట తీసుకురావాల్సి ఉంటుందని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది హజ్ యాత్ర జులై 7న మొదలై 12వ తేదీన ముగియనుంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/