సర్కారు వారి పాట ట్రైలర్ ప్రోమో రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మే 12 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. రేపు (మే 2) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ కు సంబదించిన ప్రోమో ను రిలీజ్ చేసి ట్రైలర్ ఫై మరింత ఆసక్తి నింపారు.

ఇక సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ నుండి వస్తున్న సినిమా ఫై కావడం తో ఫ్యాన్స్ అంతా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. సినిమాలో హీరో ఫాదర్‌ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా ఉండనే ఉంది. ఈ రకంగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తే.. రాబోయే సినిమాలకు హెల్ప్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

YouTube video