సర్కారు వారి పాట నుండి మా..మా ..మహేశా ఫుల్ సాంగ్ వచ్చేసింది

సర్కారు వారి పాట నుండి అసలు సిసలైన మాస్ సాంగ్ మా..మా ..మహేశా వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. మే 12 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర మేకర్స్ ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచగా..తాజాగా ఈరోజు అసలు సిసలైన మాస్ సాంగ్ ను విడుదల చేసారు.

మా..మా ..మహేశా అంటూ సాగే ఫుల్ సాంగ్ ను విడుదల చేసారు. ఈ సాంగ్ లో మహేష్ , కీర్తి సురేష్ దుమ్ముపేలే స్టెప్స్ వేశారు. మొన్నటి వరకు మహేష్ డాన్స్ లు పెద్ద చేయడు అనే కామెంట్స్ వినిపెంచేవి..కానీ సరిలేరు నీకెవ్వరూ మూవీ లో మాస్ స్టెప్స్ వేసి ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక ఈ సినిమాలో కూడా మహేష్ అదరగొట్టాడని ఈ పాట చూస్తే మరోసారి అర్ధమవుతుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా శ్రీ కృష్ణ & జోనిత గాంధీ పాడారు. మరి ఈ సాంగ్ ఎలా ఉందొ మీరు ఓ లుక్ వెయ్యండి.

YouTube video