కేసీఆర్..నీకు మిగిలేది ఆ ఆరుగురు ఎమ్మెల్యేలే అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటెల విజయం సాధించడం తో బిజెపి శ్రేణుల్లో ఉత్సహం పెరిగింది. దీంతో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్ ఫై మరింత దూకుడు పెంచారు. మొదటి నుండి సంజయ్..కేసీఆర్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్ సైతం సంజయ్ ఫై అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గత రెండు రోజులుగా ప్రెస్ మీట్ పెట్టి సంజయ్ ఫై , కేంద్రం ఫై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో కేసీఆర్ లక్కీ నెంబర్ ఫై సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

‘నా ఫామ్‌హౌస్‌ను ట్రాక్టర్‌ పెట్టి దుంతాడట.. రా వచ్చి చూడు.. ఆరు ముక్కలు అవుతావ్..’ అంటూ కేసీఆర్ ..సంజయ్ కి వార్నింగ్ ఇవ్వడం తో..అదే రేంజ్ లో సంజయ్ ..కేసీఆర్ ఫై వ్యాఖ్యలు చేసారు. ‘నన్ను నరుకుతావా..? నన్ను బూతులు తిడతావా..? నన్ను ఆరు ముక్కలు చేస్తావా..? అది కూడా నీ లక్కీ నంబర్‌.. సిండికేట్‌ నంబర్‌..’ అంటూ ఎద్దేవా చేశారు. ‘చివరకు నీకు మిగిలేది కూడా ఆరుగురు ఎమ్మెల్యేలే..’అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం తల నరికించుకోవడానికైనా తాను సిద్ధమేనని సంజయ్‌ వెల్లడించారు. ముందు రైతుల ధాన్యం కొంటావా? లేదా? చెప్పాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. రైతులు రోడ్లపై ధాన్యం పోసుకొని.. ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తున్నారన్నారు.