సంజయ్ మంజ్రేకర్కు షాకిచ్చిన బీసీసీఐ
కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగింపు!
ముంబయి: సంజయ్ మంజ్రేకర్కు షాచ్చిన బీసీసీఐ పనితీరు నచ్చకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో ధర్మశాలో జరగాల్సిన వన్డే మ్యాచ్కి (ఇది రద్దయింది) ప్యానెల్ సభ్యులైన సునీల్ గవాస్కర్, ఎల్.శివరామకృష్ణన్, మురళీకార్తీక్లు హాజరైనా సంజయ్ మంజ్రేకర్ కనిపించక పోవడం ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. ‘మంజ్రేకర్ పనితీరుపట్ల అధికారులు సంతోషంగా లేరు. అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది అని ఓ అధికారి తెలిపారు’ అంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ఈ వ్యవహారంపై కథనం ప్రచురించడంతో విషయం వెలుగు చూసింది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/