ఇదే నా చివరి సీజన్: సానియా సంచలన ప్రకటన
టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నానని వెల్లడి
2022 సీజన్ తనకు చివరిదని టెన్నిస్ సంచలం సానియా మీర్జా ప్రకటించి షాకిచ్చింది. టెన్నిస్ నుంచి తానూ రిటైర్ కాబోతున్నానని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఓటమి తర్వాత సానియా మీర్జా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ, ‘ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఇందులో ఆడుతున్నాను. నేను మొత్తం సీజన్లో ఆడగలనో లేదో తెలియదు. కానీ, నేను మొత్తం సీజన్లో ఉండాలనుకుంటున్నాను.’ అంటూ పేర్కొంది . అయితే సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్తో కలిసి ఈ గ్రాండ్స్లామ్ మిక్స్డ్ డబుల్స్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/