తప్పంతా ఆడవారిదేనా? – సమంత ఎమోషనల్ పోస్ట్

నాగ చైతన్య – సమంత లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ వస్తుండగా..కొంతమంది ఈ వార్తలు కొట్టివేయగా..మరికొంతమంది నమ్మడం జరిగింది. చివరకు వీరే తమ విడాకులు ప్రకటించడం తో అంత షాక్ అయ్యారు. ఇక ఈ ప్రకటన తర్వాత సమంత ఫై అంత నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా చైతు పేరు ప్రస్తావించకుండా..సమంత తీరు ఫై మండిపడుతున్నారు.

ఫ్యామిలీమెన్‌-2 వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ కంటెంట్‌, గ్లామరస్‌ ఫోటో షూట్‌లే విడాకులకు కారణం అంటూ సమంతను దెప్పిపొడుస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ను సైతం దారుణంగా ట్రోల్‌ చేస్తూ అతడిపై నిందలేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా లో సమంత ఎమోషనల్ పోస్ట్ చేసింది. ‘ఎప్పుడూ మహిళలనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్లను మాత్రం ఎప్పుడూ ప్రశ్నించదు..అలాంటప్పుడు మనకు ప్రాథమికంగా నైతికత లేనట్లే’ అంటూ ఓ కొటేషన్‌ను ఇన్‌స్టాలో పంచుకుంది.