జగన్ తో రెండు గంటల పాటు భేటీ అయినా సజ్జల

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇరువురు సమావేశం కావడం తో వీరిద్దరూ దేని గురించి చర్చ లు జరిపారా అని అంత మాట్లాడుకుంటున్నారు.

ఈ నెల 11 న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి వరకు నలుగురు పాత మంత్రులే కొత్త మంత్రివర్గం లో ఉండనున్నారని వార్తలు రాగా , జగన్ మాత్రం 7 నుండి 11 మంది వరకు తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో సజ్జల భేటీ ఆసక్తి రేపింది.

భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మంత్రి వర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఇతర అంశాలపై చర్చించామన్నారు. మంత్రి వర్గంలో ఎవరు ఉండాలనేది పూర్తిగా సీఎం నిర్ణయం అన్నారు. అందులో ఎవరి ప్రమేయం ఉండదని, విస్తరణపై కసరత్తు కొనసాగుతోందని సజ్జల అన్నారు.