చంద్రబాబు ఆడించినట్టల్లా ఆడే ఆటబొమ్మ పవన్ కల్యాణ్ – సజ్జల

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మండిపడ్డారు. చంద్రబాబు ఆడించినట్టల్లా ఆడే ఆటబొమ్మ పవన్ కల్యాణ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఆయన దత్తపుత్రుడు, ఆయన శిష్యగణం, ఆయన తమ్ముళ్లు మాట్లాడే మాటలు చూస్తే పిచ్చి ఏ స్థాయిలో ఎక్కిందో అర్థమవుతుంది. చంద్రబాబుకు మరీ పైత్యం ఎక్కువయిపోయింది. ఆయనే ఒక సైకో. ఈ విషయాన్ని జనం కూడా గుర్తించారు. తానింకా సైకోగానే ఉన్నానని ప్రతి రోజూ తన మాటల ద్వారా చాటుకుంటున్నారని సజ్జల అన్నారు.

ట్రాఫిక్ ఎక్కడ ఉంటే అక్కడ చంద్రబాబు మీటింగ్ పెడుతున్నారని..ఎక్కడైనా మైదానాల్లో మీటింగులు పెడుతున్నారా? ఎక్కడ ట్రాఫిక్ కనిపిస్తే అక్కడికి పోయి నిలబడుతున్నారు… అదేమని ఎవరన్నా అడిగితే నన్నే అడుగుతారా అని దబాయిస్తున్నారు” అంటూ సజ్జల మండిపడ్డారు. తాను ఏదనుకుంటే అదే రూల్ అని ఆయన భావిస్తున్నారని విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఇప్పటం అనే గ్రామానికి వస్తూ వాహనం టాప్ మీదకు ఎక్కి హైవేలో ప్రయాణించాడు. మాకు ఎలాంటి రూల్స్ ఉండవు అనే అరాచకపు బ్యాచ్ ఇది. ఇవాళ వీళ్లు మా పార్టీని ప్రశ్నిస్తుండడం వాళ్ల సహజ గుణాన్ని బయటపెడుతుందని సజ్జల ఆరోపించారు. అమరావతిలో ప్రజా జీవన విధానాన్ని టీడీపీ నాశనం చేసింది. ఇక పవన్ కల్యాణ్ ని చూస్తే రాజకీయం అంటే 60 సీన్ల సినిమా అనుకుంటున్నాడు” అంటూ సజ్జల విమర్శించారు.