సాయిధరమ్ తేజ్ కలర్ బోన్ సర్జరీ సక్సెస్

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు ..కలర్ బోన్ సర్జరీ చేసారు అపోలో వైద్యులు. ఈ సర్జరీ సక్సెస్ అయినట్లు డాక్టర్స్ చెప్పారు. తేజు ఆరోగ్యం మెరుగుపడుతుందని… మరో 24 గంటలపాటు డాక్టర్స్ పరివేక్షణలో తేజు ఉండనున్నారు. నిన్న, ఈ రోజు వెంటిలేషన్ తీస్తున్నప్పుడు ‘నొప్పిగా ఉంది’.. అంటూ తేజ్ అన్నట్టు డాక్టర్లు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. అంతేకాదు వెంటిలేటర్ తీసినప్పుడు స్ప్రహలోకి కూడా వస్తున్నారు. తేజు ఆరోగ్యం మెరుగుపడుతుండడం తో అంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ సభ్యులు తేజు ను చూసేందుకు హాస్పటల్ కు వస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం తేజు ఆరోగ్యం పట్ల ఆరాతీస్తూనే ఉన్నారు.

తేజు కు ప్రమాదం ఎలా జరిగిందనేది చూస్తే..శుక్రవారం రాత్రి కేబుల్ బ్రిడ్జ్ ఫై స్పోర్ట్స్ బైకుపై వెళుతున్న స‌మ‌యంలో సాయి ధరమ్ తేజ్ అదుపు త‌ప్పి కింద ప‌డ్డాడు. దీంతో ఆయ‌నకు కుడి క‌న్ను పైన‌, ఛాతి, పొట్ట భాగంలో గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను మెడికవర్ లో అడ్మిట్ చేసారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ అపోలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.