ప్రమాదానికి గురైన తేజ్ ఫై పోలీసులు కేసు నమోదు

సినీ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. హైదరాబాద్​లోని కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్​ బైక్​పై వెళ్తున్న క్రమంలో బైక్ స్కిడ్ కావడం తో తేజ్ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ఫై ఇసుక ఉండడం తో బైక్ స్కిడ్ అయినట్లు సమాచారం,. ఈ ప్రమాదంలో తేజ్ కన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ముందుగా సమీపంలోని మాదాపుర్ మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం తేజ్​ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు.. అతడిని 24 గంటల పాటు పర్యవేక్షిస్తామని తెలిపారు. కాలర్​ బోన్​ వద్ద గాయం మినహా అంతర్గత గాయాలు ఏవీ కాలేదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం తేజ్​కు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నామన్నారు.. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌ ఆస్పత్రికి చేరుకొని తేజ్​ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌, రామ్ చరణ్ ఆస్పత్రికి చేరుకొని తేజ్​ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సాయి ధరంతేజ్ నడిపించిన బైక్ ఆయనది కాదని తెలుస్తోంది. ఈ బైక్ అనిల్ కుమార్ బుర్రా రిజిస్టర్ అయి ఉండడం గమనార్హం. సాయిధరమ్ తేజ వాడిన స్పోర్ట్స్ బైక్ ట్రంప్ చాలా ఖరీదైనది. 1160 సి సి ట్రిపుల్ ఇంజన్ కలిగిన ఈ బైక్ ధర రూ.18 లక్షలు. ఇక ఈ బైక్ పై గతంలోనే ఓవర్ స్పీడ్ కారణంగా చాలా చలాన్లు ఉన్నాయి. చివరగా 2020 ఆగస్టు 2న ఓవర్ స్పీడ్ కారణంగా ఈ బైక్ కు చలాన్ పడినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా… యాక్సిడెంట్ కు గురి అయిన సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదైంది. రాయదుర్గం పోలీసులు హీరో సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం మరియు రాష్ డ్రైవింగ్ కింద… ఐపీసీ 3, 36,184 ఎంవీ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు.

YouTube video