వ్యవస్థలన్నీ నాశనం అయ్యాక ఎవరికీ భద్రత
అమరావతి: ఏపి ప్రభుత్వంపై టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ఒక ఆటవిక రాజ్యంతో ముందుకుపోతున్నారని విమర్శంచారు.పుంగనూరు ఓం ప్రకాష్ ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గర సమాధానం ఉందా? అని ప్రశ్నించారు. ఒక ప్రతిపక్ష నేతగా తాను తప్పులను ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా… తమను సాక్ష్యాలడిగే పరిస్థితిలో పోలీసులున్నారని చంద్రబాబు తప్పుబట్టారు. ఇదే తీరు కొనసాగితే రేపు పోలీసులు కూడా బలికాక తప్పదని హెచ్చరించారు. వ్యవస్థలన్నీ నాశనం అయ్యాక ఎవరికీ భద్రత ఉండదన్నారు. అమరావతి నిర్మాణంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడుందో.. ప్రభుత్వం చెప్పాలని 100సార్లు సవాల్ విసిరినా సమాధానం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/