పాకిస్తాన్ జట్టుకు అదనపు ఫీల్డర్ గా..సచిన్

తన జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లో ప్రస్తావన

Sachin's biography Playing It My Way'
Sachin’s biography Playing It My Way’

సచిన్ టెండూల్కర్ భారత్ ఆటగాడు అన్నది జగమెరిగిన సత్యం . మరి పాకిస్తాన్ కు ఎపుడు ఆడాడబ్బా అని ఆలోచించకండి.. ఇది సచిన్ భారత్ కు ప్రాతినిధ్యం వహించక ముందు మాట. ఈ విషయం చాల కొద్దీ మందికే తెలుసు. ఈ విషయాన్ని 48 ఏళ్ళ సచిన్ తన జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకం లో ప్రస్తావించారు. సచిన్ 1989 లో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా కరాచీ టెస్ట్ లో సచిన్ తన తొలి టెస్ట్ ను ఆడాడు. జట్టు ఇండియాలో అయితే దానికి రెండేళ్ల ముందు పాకిస్తాన్ జట్టు ఇండియా లో పర్యటించినపుడు ముంబయి లోని బ్రబౌర్న్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో సచిన్ కొంత సేఫ్ పాకిస్తాన్ జట్టుకు అదనపు ఫీల్డర్ గా వ్యవహరించాడు. ఆ సంఘటనను సచిన్ వివరిస్తూ లంచ్ తర్వాత పాక్ ఆటగాళ్లు మియాందాద్ , అబ్దుల్ ఖాదిర్ లు ఆలస్యం చేయటంతో పాక్ కెప్టెన్ సచిన్ ను కొద్దిసేపు ఫీల్డింగ్ చేయాలసిందిగా కోరాడు. దీంతో ఆశ్చర్య పోయిన సచిన్ ఫీల్డింగ్ కు దిగాడు. ఒక దశలో కపిల్ దేవ్ క్యాచ్ ను అందుకున్నంత పని చేసాడు. లాంగ్ ఆన్ లో ఉన్న సచిన్ చాల దూరం పెరిగేట్టు కుంటూ వచ్చి మిదం లో క్యాచ్ మిస్ చేసాడు. ఈ విషయాన్నీ సచిన్ గుర్తు చేసుకుంటూ నాటి సంఘటన ఇమ్రాన్ ఖాన్ కు గురుతుందో లేదో ? అని తన బయోగ్రఫీ లో పేర్కొన్నాడు. అలా సచిన్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ను పాకిస్తాన్ కు ఆడాడు. ఆ తర్వాత భారత్ జట్టుకు ఎంపికై మేటి ఆటగాడిగా ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/