మరోసారి ఉదారతను చాటుకున్న సచిన్
ఐదువేల మంది అన్నార్థులకు సాయం
ముంబయి: ఇప్పటికే కరోనా పై పోరుకు విరాళమిచ్చి తన గొప్ప మనసు చాటుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మరోమారు తన ఉదారతను చాటుకున్నాడు. కరోనా కారణంగా ఆకలితో గడిపే అన్నార్థుల అండగా నిలిచేందుకు ముందుకోచ్చాడు. నెలకు ఐదువేల మంది ఆకలిని తీర్చాలనే ఉద్దేశ్యంతో అప్నాలయా అనే స్వచ్చంద సంస్థతో చేతులు కలిపాడు. ఈ విషయాన్ని అప్నాలయా తన అధికారిక ట్విట్టర్ ఖతాలో పేర్కోంది. ఐదువేల మందికి అవసరమయ్యే రేషన్ సరుకులు అందిస్తూ మాసంస్థకు సహయం చేస్తున్న సచిన్కు కృతజ్ఞతలు అని ట్వీట్ చేసింది. సచిన్ కూడా ఈ సహయం అందిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/