25లక్షలు విరాళం ప్రకటించిన సచిన్‌

కరోనా పై పోరుకు వినియోగించాలని వినతి

sachin tendulkar
sachin tendulkar

ముంబయి: దేశంలో కరోనా పై పోరుకు ప్రతి ఒక్కరు నడుంబిగుస్తున్నారు. కరోనా నివారించేందుకు దేశంలోని ప్రముఖులు తమ వంతుగా సాయం చేస్తున్నారు. కాగా ఇపుడు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కరోనా పై పోరాటానికి ప్రధాన మంత్రి సహయనిధికి 25 లక్షలు విరాళం ప్రకటించాడు. అలాగే మహరాష్ట్ర ముఖ్యమంత్రి సహయనిధికి కూడా 25 లక్షలు విరాళం ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఈ మొత్తాన్ని కరోనా నివారణ చర్యలకు వినియోగించాలని కోరాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/