ఇంటర్ విద్యార్థులకు సబితా ఇంద్రారెడ్డి సూచన
పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కావొద్దు
వికారాబాద్: ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం మంత్రి బృంగి కళశాల, సిద్ధార్థ కళాశాలల సెంటర్లలో పరీక్షలు రాయటానికి వెళ్తున్న విద్యార్థులకు బాగా రాయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడికి లోను కావొద్దని, పరీక్షలు బాగా రాయాలని సబితా ఇంద్రారెడ్డి ధైర్యం చెప్పారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/