శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లు
కేరళ : శబరిమలకు అయ్యప్ప భక్తుల తాకిడి పెరిగిపోతోంది. దీంతో రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నట్లు తెలుస్తోంది. జనవరి 3 నుంచి 16 వరకు ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/