పనస గింజల వడలు
రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకుల కోసం

కావలసిన పదార్థాలు:
పనస గింజలు-2 కప్పులు
బియ్యప్పిండి- ఒక కప్పు,
పచ్చిమిర్చి-4, పచ్చికొబ్బరి తురుము- ఒక కప్పు,
ఉల్లి తరుగు – అరకప్పు, జీలకర్ర – ఒక టీ స్పూను,
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – పావుకప్పు, అల్లం తరుగు- ఒక టేబుల్ స్పూను
నూనె- వేగించడానికి సరిపడా.
తయారు చేసే విధానం
పనస గింజలపై పొట్టు తీసి కుక్కర్లో ఉడికించాలి. మిక్సీలో చల్లారిన పనస గింజలు, అల్లం, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి పేస్టు చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెనలో వేసి అందులో ఉప్పు, కొత్తిమీర వేసి పేస్టు బియ్యప్పిండి, జీలకర్ర వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కొంతకొంత తీసుకుని వడలుగా ఒత్తి కగిన నూనెలో దోరగా రెండువైపులా వేగించుకోవాలి. ఇష్టమైనవారు ఇదే మిశ్రమాన్ని పకోడీగా కూడా వేసుకోవచ్చు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/