ఏపీ ప్రజలకు ఆర్టీసీ శుభ ‘వార్త ‘
అడ్వాన్స్ బుకింగ్ ను ముప్పై రోజుల ముందుగానే చేసుకునే వెసులుబాటు
Amaravati: ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభ ‘వార్త ‘ చెప్పింది.
కరోనా ఉదృతి నేపథ్యంలో బస్సు టికెట్లను ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే గడువు విధించింది.
కాగా తాజాగా ఆ గడువుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం బస్సు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ను ముప్పై రోజుల ముందుగానే చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. కాగా ఈ అవకాశం శనివారం నుండే అమలులోకి వచ్చింది.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/