తిరుమల శ్రీవారి పాదాలకు ఆర్టీసీ బస్‌ ట్రయల్‌ రన్‌

తిరుమల భక్తుల కోసం మూడు రకాల బస్సులు

RTC-bus

తిరుమల: తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలోని ‘శ్రీవారి పాదాలు’ వద్దకు ఓ బస్సుతో ఆర్టీసీ అధికారులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించింది. ఈ సందర్భంగా రెండు మలుపుల్లో బస్సు తిరగడం కష్టమైనట్టు అధికారులు గుర్తించారు. దీంతో మలుపులను వెడల్పు చేయడంతోపాటు రోడ్డుకు మరమ్మతులు చేస్తే బస్సులు నడిపేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ టీటీడీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, దేవాలయ అవసరాలతోపాటు స్థానికులు, వ్యాపారుల సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా కార్గో సర్వీసులు ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల భక్తుల కోసం ఆర్టీసీ మూడు రకాల బస్సులను సిద్ధం చేస్తోంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/