శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

రోజుకు 5 వేల చొప్పున టికెట్లు అందుబాటులో

తిరుమల: తిరుమలలో ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించి రూ. ౩౦౦ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. ఈ మూడు రోజుల్లో రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విక్రయిస్తారు.

కాగా, తిరుమలలో పనిచేస్తున్న సన్నిధి యాదవులకు వంశపారంపర్య హక్కులు పునరుద్ధరిస్తూ చేసిన సవరణ చట్టం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతోపాటు దేవాలయాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించేందుకు సంబంధించి ఆదాయ పరిమితులను మార్చేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పించే సవరణ చట్టం కూడా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/