ఎల్బీనగర్ లోని కార్ గ్యారేజ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 3 కోట్ల నష్టం

ఎల్బీనగర్ లోని ఓ కార్ గ్యారేజ్ లో గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం జారుగా..ఈ ప్రమాదం వల్ల సదరు యజమానికి దాదాపు రూ. 3 కోట్లు నష్టపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటి జంగయ్య నగర్‌లోని ‘కార్ ఓ మ్యాన్’ గ్యారేజీ అగ్నికి ఆహుతైంది. ఓ గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో గ్యారేజీలోని 20 కార్లు దగ్ధమయ్యాయి.

దాదాపు రెండున్నర గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదం నుంచి నాలుగు కార్లను బయటకు తీయగలిగామని, మిగతావి అగ్నికి ఆహుతయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదన్నారు. కాగా, కార్లు కాలిపోవడంతో దాదాపు రూ. 3 లక్షల నష్టం వాటిల్లింది. విషయం తెలిసిన కార్ల గ్యారేజీ యజమాని విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన నష్టాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు.