సైదాబాద్‌ నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన పోలీస్ శాఖ

సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారి పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి ఆమె మరణానికి కారణమైన నిందితుడు పల్లంకొండ రాజు ఆచూకీ ఇంకా లభించలేదు. గంటలు గడిచిపోయాయి…కానీ నిందితుడు మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు.దీంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతుంది. అఘాయిత్యానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలుస్తోంది. ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ తరుణంలో సైదాబాద్‌ నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది పోలీస్ శాఖ. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామంటూ హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ప్రకటన విడుదల చేసారు.

ఈ సందర్భంగా అంజనీ కుమార్‌ మాట్లాడుతూ… సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి డబ్బులు ఇవ్వడం తో పాటు… వారి వివరాలను చాలా గోప్యం గా ఉంచుతామని ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తాము రివార్డు ప్రకటిస్తున్నామన్నారు. నిందితుడు రాజు వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని… అలాగే ఎ్తతు… సుమారు 5.9 అడుగులు ఉంటాడని చెప్పారు. నిందితుడి చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616366 మరియు 9490616627 అనే ఫోన్‌ నంబర్ల కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.