ఎమ్మెల్యే రోజాకు పెను విమాన ప్రమాదం తప్పింది

వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడింది. రాజమండ్రి-తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం తిరుపతిలో దిగకుండా బెంగళూరులో ల్యాండ్‌ అయింది. రెండు గంటలుగా ప్రయాణికుల విమానంలోనే ఉన్నారు. విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు వీఐపీలు ఉన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్ గా బెంగుళూరులో దింపారు. ఎమ్మెల్యే రోజా ఇంకా విమానంలోనే ఉన్నారు. ఈ విషయాన్ని రోజా ఓ వీడియో ద్వారా తెలియజేశారు. డోర్లు ఓపెన్ కావడంలేదని ఆమె వీడియోలో చెప్పుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల స్వల్పంగా విమానం ఊగినట్లు తెలిపారు. కింద ల్యాండ్‌ కనిపించడం లేదని అధికారులు తెలిపారని అన్నారు. సాంకేతిక లోపం ఉన్నందున బెంగళూరు ఎయిర్‌పోర్టులో వరకు తీసుకువచ్చామని చెప్పారని రోజా తెలిపారు.