రాబోయే ఎన్నికల్లో టీడీపీ కి ఎన్ని సీట్లు వస్తాయో తెలిపిన మంత్రి రోజా

minister-rk-roja-replies-to-tdp-leader-anitha-remarks

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు వినిపిస్తుండడంతో నేతలంతా ఇప్పటి నుండే ప్రచారంలో మునిగిపోయారు. రాబోయే ఎన్నికల్లో 175 కు 175 సాధిస్తామని వైస్సార్సీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరోపక్క జనసేన పార్టీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని పిలుపునిస్తుంది. అలాగే టీడీపీ సైతం మరోసారి వైస్సార్సీపీ కి ఛాన్స్ ఇస్తే ఇక రాష్ట్రాన్ని ఎవ్వరు బాగుచేయలేరని ప్రచారం చేస్తుంది. ఈ క్రమంలో మంత్రి రోజా రాబోయే ఎన్నికల్లో టీడీపీ కి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పింది.

అమరావతి పేరుతో చంద్రబాబు బినామీలతో కట్టుకున్న కోట బద్దలు అవుతోందని.. ప్రజల అవసరాల మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆయన సొంత నిర్ణయాలు కాదని.. ‘175 మీరే తెచ్చుకుంటే మేము ఏం చెయ్యాలని పవన్ అంటున్నారని’ ఎద్దేవా చేశారు. 2019లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఏం చేశారో అదే చెయ్యాలన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరినీ చూసి జనం ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వచ్చే సీట్లు సున్నా అంటూ జోస్యం చెప్పారు.