చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదు
పాలనంటే మేకప్ వేసుకోవడం కాదు
అమరావతి: చంద్రబాబును విమర్శించే స్థాయి ఎమ్మెల్యే రోజాకు లేదని టిడిపి నాయకురాలు దివ్యవాణి అన్నారు. రోజా వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ..సొంత నియోజకవర్గం ప్రజలే ఎమ్మెల్యే రోజాను ఛీ కొడుతున్నారని విమర్శించారు. పాలనంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్థ్ స్కిట్ కాదని రోజా తెలుసుకోవలన్నారు. రోజా వ్యవహారశైలితో సినీరంగం తలదించుకోవాల్సి వస్తోందని దివ్యవాణి అన్నారు. ఇంకా రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న ప్రజలను పోలీసులతో దారుణంగా కొట్టిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రజల మధ్యకు రాలేని దుస్థితిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరియు వైఎస్ఆర్సిపి నేతలు ఉన్నారని విమర్శించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/