అయ్యన్న వ్యాఖ్యలు..ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా- ఎమ్మెల్యే రోజా

గత రెండు రోజులుగా తెలుగు దేశం నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. జగన్‌, వైసీపీ సర్కార్‌, కొందరు మంత్రులను, డీజీపీని టార్గెట్‌ చేస్తూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై అధికారపార్టీ మండిపడుతోంది. శుక్రవారం చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు యత్నించాయి. అక్కడ యుద్ధ వాతావరణమే చోటుచేసుకుంది. ఆ తర్వాత కూడా అయ్యన్న ..వైసీపీ నేతల ఫై ఘాటైన వ్యాఖ్యలే చేసారు.

ఇక అయ్యన్న కామెంట్స్ ఫై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. శనివారం ఉదయం శ్రీవారి దర్శించుకున్న ఆమె..మీడియా తో మాట్లాడుతూ..అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. అయ్యన్న ఎమ్మేల్యే పదవి పీకేసారు.. మంత్రి పదవి పీకేసారు… చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పీకేసారు… లోకేష్ జెండా పదివి పీకేసారు… ఇంకా ఎమి పీకాలి అంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.