రోహిత్శర్మకు ఐపిఎల్ జరిమాన

కోల్కతా : అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై ఆటగాళ్లు తమ అసహనాన్ని మైదానంలోనే వ్యక్తపరుస్తున్నారు. మొన్న ధోని.. నిన్న కోహ్లీ.. తాజాగా రోహిత్శర్మ. ఆదివారం రాత్రి కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 233 పరుగుల భారీ లక్ష్యంతో ముంబయి ఇండియన్స్ లక్ష్యఛేదనకు దిగింది. నాలుగో ఓవర్ వేసేందుకు కోల్కతా ఫాస్ట్ బౌలర్ గర్నీ బౌలింగ్కు వచ్చాడు. ఓవర్లో మూడో బంతికి రోహత్శర్మను అంపైర్ నితిన్ మీనన్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. రోహిత్శర్మ ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని కోరాడు. ఆ సమీక్షలో బంతి పిచింగ్ ఔట్ సైడ్లో పడటంతో పాటు లెగ్ వికెట్ను కొంచెం తాకుతూ వెళ్లినట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్.. ‘అంపైర్స్ కాల్’కు అవకాశం ఇచ్చాడు. మైదానంలో అంపైర్గా ఉన్న నితిన్ మీనన్ ముంబయి ఔట్గా ప్రకటించడంతో రోహిత్ అసహనానికి గురయ్యాడు. బౌలింగ్ ఎండ్లో ఉన్న అంపైర్ దగ్గరికి వచ్చి ఏవో వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా అక్కడున్న వికెట్లను తన బ్యాటుతో కొట్టాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద రోహిత్శర్మకు మ్యాచ్ ఫీజులో 15శాతం కోత పడింది. ఈ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/sports/