తీహార్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ.. గ్యాంగ్స్టర్ హత్య
టిల్లు తాజ్పురియా అలియాస్ సునీన్ మాన్పై ప్రత్యర్థి యోగేశ్ దాడి
న్యూఢిల్లీః ఢిల్లీలోని తీహార్ జైల్లో ఈరోజు తెల్లవారుజామున దారుణం జరిగింది. ఇద్దరు ఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటన నిందితుడు టిల్లు తాజ్పురియా అలియాస్ సునీన్ మాన్పై ప్రత్యర్థి యోగేశ్ దాడి చేసి చంపాడు. గ్యాంగ్స్టర్ యోగేశ్తో పాటు అతని అనుచరులు తాజ్పురియాపై ఇనుపరాడ్తో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన జైలు అధికారులు, పోలీసులు.. టిల్లు తాజ్పురియాను చికిత్స నిమిత్తం దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే తాజ్పురియా చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.