ఏపీ-కర్ణాటక సరిహద్దులో ప్రైవేట్ బస్సు బోల్తా : 10మంది మృతి

Video related to road accident incident

ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక సరిహద్దులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేటు బస్సు బోల్తా పడి 10 మంది మృతి చెందారు.ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు వైఎన్ హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా పలవలహళ్లి దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

స్థానికులు, వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. బస్సులో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారంతో పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక వివరాల ప్రకారం బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తా పడిందని తెలుస్తోంది. . ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

క్రీడా వార్తల కోసం : https://www.vaartha.com/news/sports/