వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

Road accident in Vikarabad district-7 killed
Road accident in Vikarabad district-7 killed

Vikarabad: వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి  చెందిన వారు.   

ఇజ్రా చిట్టెంపల్లి తండా సర్పంచ్ చెందర్ నాయక్ ఇంటి ముందు కోటపల్లి — మోమిన్ పేట్ ప్రధాన రోడ్డుపైన ఘటన ఒకే కుటుంభానికి చెందినవారు ఆటోలో ఎక్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆర్ టి సి బస్సు అప్పుడే వచ్చి ఆటో ముందు ఆగింది.

వెనుకాలే లారీ వేగంగా వచ్చింది. దానిని గమనించని ఆటో డ్రైవర్ ముందుకు కదిలాడు. దీంతో  ఆటోను లారీ డీ కొట్టడంతో లారీ రోడ్డుపక్కకి దూసుకు పోయి మూడు పల్టీలు కొట్టింది. ఆటో లో ఉన్న ఏడుగురు మృతి చెందారు . లారీ లో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/