ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

జోగిపేట : సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్కల్ మండలం చౌటకూర్ వద్ద ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. సంగారెడ్డి నుంచి మెద‌క్‌కు కారులో వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/