ప్రకాశంలో ఘోరం : గేదే కళేబరం ఐదుగురిని చంపేసింది

ప్రకాశం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ శుభకార్యం నిమిత్తం దర్శి గ్రామానికి చెందిన కొంతమంది ఆటోలో బెస్తవారిపేట మండలం కొత్తపల్లికి వెళ్లి వస్తుండగా రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంపై ఆటో ఎక్కడంతో ఒక్కసారిగా పల్టీకొట్టింది. ఈ ఘటన లో ఐదుగురు అక్కడిక్కడే చనిపోగా..పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను మార్కాపురం ఏరియా ఆస్పత్రికి క్షతగాత్రులు తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తుర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతిచెందిన వారు దర్శి గ్రామానికి చెందిన పొట్లపాటి సారమ్మ, గొంగటి మార్తమ్మ, ఇత్తడి లింగమ్మ, కోటమ్మ, ఆటో డ్రైవర్ వేంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు. చీకట్లో రోడ్డు మీద పడి ఉన్న గేదె కళేబరాన్ని డ్రైవర్ గుర్తించకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారింఛి కేసు నమోదు చేసారు.