ఘోర బ‌స్సు ప్ర‌మాదం..28 మంది మృతి

అదుపుతప్పి కాల్వ‌లో ప‌డిన బ‌స్సు..మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 28 మృతి చెందారు. సిధి నుంచి సత్నాకు వెళ్తున్న సమయంలో అదుపు తప్పి వంతెనపై నుంచి బస్సు ఒక్కసారిగా నీళ్లలో పడి మునిగిపోయింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బ‌స్సు కాల్వ‌లో ప‌డిన అనంత‌రం ఏడుగురు ప్ర‌యాణికులు సుర‌క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా వారికోసం స‌హాయ‌క బృందాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ ప్రమాద ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

ఈ ప్రమాదంపై స్పందించిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సిధి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం ఆఫీస్‌ ఓఎస్‌డీ సత్యేంద్ర ఖరే ఓ ప్రకటనలో చేశారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/