లోకేష్ ఫై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ..తెలుగుదేశం అధినేత చంద్రబాబు , ఆయన కుమారుడు లోకేష్ ల ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ లు చీరలు కట్టుకోవాలని రోజా అన్నారు.

ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ మహిళా ద్రోహి పార్టీ అని.. టీడీపీలో కన్నా ఉన్మాదులు దేశంలో ఎక్కడైనా ఉ‍న్నారా ? అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి గారి ఇమేజ్‌ను దిగజార్చాలని టీడీపీ బూతు పురాణంతో మాట్లాడుతోందని మండిపడ్డారు. దమ్మున్న నాయుకుడు సీఎం జగన్‌ అని అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.

దిశా పోలీస్ స్టేషన్లను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రశంసించిందని మంత్రి రోజా గుర్తుచేశారు. చంద్రబాబు మహిళల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా? అని నిలదీశారు. మహిళల సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అని కొనియాడారు. చంద్రబాబు ఎందుకు నిరసనలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. దమ్ము గురించి టీడీపీ మాట్లాడుతోందని… 12 ఏళ్లుగా జగన్ దమ్మెంటో చూస్తున్నారు కదా.. ఒక్క ఎమ్మెల్యేగా మొదలై 151 ఎమ్మెల్యేలకు చేరిన దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మహిళ అందరి ఆశీస్సులతో లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీని వైసీపీ దారుణంగా ఓడించిందని.. కుప్పంలో కూడా మీరు ఓడిపోయారని గుర్తు చేశారు. ఒంటరిగా పోరాటం చేయలేని పార్టీ టీడీపీ అని.. ఎవరితో పొత్తులు పెట్టుకుందామా అని చూసే పార్టీ టీడీపీ అని విమర్శించారు.