మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.98.76: డీజిల్ రూ.93.70

Rising Petrol-Diesel prices again
Rising Petrol-Diesel prices again

New Delhi: దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. జూన్ నెలలో వరుసగా మూడో సారి వీటి ధరలను పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెరిగాయి. ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.4.71, డీజిల్‌పై రూ.5.28 వరకు చమురు కంపెనీలు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో ఢిల్లీ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.03, డీజిల్‌ రూ.85.95కు చేరింది.

ముంబైలో లీటర్ పెట్రోల్‌ రూ.రూ.101.45, చైన్నైలో రూ.96.47, కోల్‌కతాలో రూ.95.02, బెంగళూరులో రూ.98.20, లక్నోలో రూ.92.29, పాట్నాలో రూ.రూ.97.18, చండీగఢ్‌లో రూ.91.40, హైదరాబాద్‌లో రూ.98.76కు చేరింది.

డీజిల్ ముంబైలో లీటర్‌ ధర రూ.85.95 పలుకుతుండగా.. చైన్నైలో రూ.90.66, కోల్‌కతాలో రూ.88.80, బెంగళూరులో రూ.91.12, పాట్నాలో రూ.91.24, లక్నోలో రూ.86.35, హైదరాబాద్‌లో రూ.93.70కి చేరింది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీట‌ర్‌ పెట్రోల్‌ ధర రూ.105.33కి చేరగా.. డీజిల్‌ ధర వందకు దగ్గరైంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/news/international-news/