రష్మిక కు రిషబ్ శెట్టి కౌంటర్

కాంతారా మూవీ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన కన్నడ హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి..హీరోయిన్ రష్మికకు కౌంటర్ ఇచ్చాడు. కన్నడ చిత్ర పరిశ్రమ నుండే వచ్చిన రష్మిక..ఆ ఇండస్ట్రీ పైనే విమర్శలు చేయడం..పాన్ ఇండియా హిట్ కొట్టిన కాంతారా ను చూడలేదని అనడం వంటివి ఆమెను వివాదంలో నెట్టేశాయి. రష్మిక తీరుపై కన్నడ అభిమానులు ఆగ్రహం తో ఊగిపోతున్నారు.

ఈ క్రమంలో రిషబ్ శెట్టి ..రష్మిక కు కౌంటర్ ఇచ్చారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన తొలి చిత్రం కిరిక్ పార్టీ. దీనికి రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌కుడు. 2016 డిసెంబ‌ర్ 30న విడుద‌లైంది. ర‌ష్మిక మాజీ ప్రియుడు ర‌క్షిత్ శెట్టి హీరోగా న‌టించారు. ఆ సినిమా క‌న్న‌డ‌లో చాలా పెద్ద హిట్ అయ్యింది. నిజానికి ఆ సినిమా వ‌ల్లే ర‌ష్మిక పేరు తెలుగులో వినిపించింది. ర‌ష్మిక‌కు హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చిన కిరిక్ పార్టీ చిత్రం విడుద‌లై ఆరేళ్లు అవుతుంది.

ఈ సంద‌ర్బంగా రిష‌బ్ ఓ ట్వీట్ చేశారు. ‘‘మా రిలీజై ఆరేళ్లు అవుతుంది. థియేటర్స్‌లో మీరు మా కోసం చేసిన సంద‌డి, వేసిన విజిల్స్‌ను మ‌ర‌చిపోలేం. మా చెవుల్లో ఇంకా మారు మోగుతున్నాయి. ఆరోజుల్లోకి మ‌మ్మ‌ల్ని తీసుకెళ్లాయి. ఈ సెల‌బ్రేష‌న్స్‌లో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌’’ అని మెసేజ్ పెట్టారు. దీంతో పాటు హీరో ర‌క్షిత్ శెట్టి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌నీష్ లోక్‌నాథ్‌, నిర్మాణ సంస్థ ప‌ర‌మ్‌వ‌హ్ స్టూడియోస్ పేరుని ట్యాగ్ చేశాడు. కానీ ర‌ష్మిక మంద‌న్న పేరుని ట్యాగ్ చేయ‌లేదు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.