నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు… మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు పతనమై 40,966కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 12,060 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.34 గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/