జగన్ కు ‘జాగ్రత్త’ చెప్పిన వర్మ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ..సంచలన సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ జాగ్రత్త చెప్పి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యాడు. మొన్నటివరకు వైసీపీ సర్కార్ కు కాస్త సపోర్ట్ గా ఉన్న వర్మ..ఇప్పుడు సినిమా టికెట్ ధరల విషయంలో వైసీపీ సర్కార్ చేస్తున్న తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ …సర్కార్ ఫై నిప్పులు చెరుగుతున్నారు. గత వారం రోజులుగా వర్మ..టికెట్స్ ధరల విషయంలో వరుస ట్వీట్స్ , పలు చానెల్స్ లలో డిబేట్ లు చేస్తూ వస్తున్నారు.

సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించిన వర్మ, ఆ తరువాత కూడా వదలకుండా సోషల్ మీడియాలోనూ పది లాజికల్ ప్రశ్నలను సంధించారు. మంత్రి పేర్ని నాని కూడా ఏమాత్రం తగ్గలేదు. పది ప్రశ్నలకు తోడుగా మరో పది ప్రశ్నలను వేస్తూ బదులిచ్చారు. ఇక అందరూ అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి మాట్లాడుకుందాం అంటూ సోషల్ మీడియా వార్ కు చెక్ పెట్టారు. ఇంతటితో ఈ వార్ ముగుస్తుందని అనుకున్నారు. కానీ వర్మ తన ట్విట్టర్ లో పెద్ద బాంబ్ పేల్చారు.

“వైసీపీలో నేను నమ్మే ఒకే ఒక్క పర్సన్ వైఎస్ జగన్… చుట్టూ ఉన్న వైసీపీ లీడర్స్ ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఉపయోగాల కోసం, అజెండా కోసం జగన్ ను తప్పుగా చూపిస్తున్నారు. హే జగన్… నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్ తో జాగ్రత్తగా ఉండు” అంటూ ట్విట్టర్ వేదికగా జగన్ ను హెచ్చరించారు. మరి ఈ హెచ్చరిక ఫై వైసీపీ నేతలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.