రివోల్ట్‌ ఈ-బైక్స్‌ను విడుదల చేసిన ఇంటెల్లీకార్ప్‌

Revolt Intellicorp launches e-bikes in Hyderabad
Revolt Intellicorp launches e-bikes in Hyderabad

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రివోల్ట్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లను రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌ విడుదల చేసింది. నగదు చెల్లించి తీసుకుంటే ఆర్‌వీ 400 బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1,03,999. దీనికి అదనంగా బుకింగ్‌ కోసం రూ.3,999 చెల్లించాలి. ఆర్‌వీ300 మోటార్‌ సైకిల్‌ ధర రూ. 84,999. బుకింగ్‌కు అదనంగా రూ.2,999 చెల్లించాలని రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ తెలిపారు. లేదంటే 38 నెలలు నెలకు రూ.3,999 చెల్లించి ఆర్‌వీ400ను ముందుగానే పొందే సదుపాయం కూడా ఉంది. ఆర్‌వీ300 బైక్‌కు నెలకు రూ.2,999 చొప్పున 36 నెలలు చెల్లించాలి. వీటికి బుకింగ్‌ రుసుము అదనమని అన్నారు. 3.24 కిలోవాట్‌ లిథి యం అయాన్‌ బ్యాటరీ కలిగిన ఆర్‌వీ 400 బైక్‌ ఒకసారి చార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్లు వెళుతుందని చెప్పారు. గంట కు గరిష్ఠంగా 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/