కొత్త రెవెన్యూ చ‌ట్టంతో పార‌ద‌ర్శకత ఉంటుంది

Indrakaran Reddy
Indrakaran Reddy

ఆసిఫాబాద్‌: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నార్నూర్ లో నిర్వహించిన ఎడ్ల బండ్ల ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టానికి నాంది పలికిన సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతగా ఈ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొత్త రెవెన్యూ చట్టంతో అన్నదాతల కష్టాలు పూర్తిగా తొలగనున్నాయయ‌ని అన్నారు. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా జరుగుతున్న భూ మార్పిడులు, పుస్తకాల జారీ, ప్రభుత్వ భూముల బదిలీ, బినామీ పేర్లతో భూకబ్జాలను అడ్డుకునేందుకే సిఎం కెసిఆర్ కొత్త రెవెన్యూ చ‌ట్టం తెచ్చార‌న్నారు.

ఇప్పటి వరకు భూమి కొన్నతర్వాత మ్యుటేషన్‌ కోసం రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేద‌ని, ఇప్పుడు ఆ సమస్య ఉండద‌ని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంతో పార‌ద‌ర్శకత ఉంటుంద‌ని, లంచం ఇవ్వడం, తీసుకోవ‌డం నేర‌మేన‌న్నారు. ఎవరు కూడా ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని స్పష్టం చేశారు. ఈ ర్యాలీకి స్థానిక రైతులు, మహిళలు పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/