వీఆర్ఎల సమస్యల ఫై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

revanth-reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసారు. రాష్ట్రంలో వీఆర్ఎల బతుకులు అగమ్యగోచరంగా మారాయని, వారి అకాల మరణాలు, ఆత్మహత్యలు నిత్యకృత్యం కావడం బాధాకరమని అన్నారు. వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. వారి సమస్యలు పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించి, ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేసీఆర్ ను రేవంత్ కోరారు.

తమ సమస్యలను పరిష్కరించావని, ఉద్యోగ భద్రత కల్పించాలని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వీఆర్ఏలు గత 48 రోజలుగా సమ్మె చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అయిన మీ రాక్షస ప్రభుత్వంలో చలనం లేకపోవడం అత్యంత బాధాకరం. గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)కు పే స్కేల్‌ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా 2020, సెప్టెంబర్ 9న మీరు హామీ ఇచ్చి సరిగ్గా రెండేళ్లు దాటింది. “ఇకపై వీఆర్వోలు ఉండరు. విద్యార్హతలు కలిగిన వీఆర్‌ఏలకు పే స్కేల్‌అమలు చేస్తాం. ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పిస్తాం. 55 ఏళ్లు నిండితే వారి పిల్లలకు వారసత్వంగా వీఆర్‌ఏలుగా అవకాశం కల్పిస్తాం…” అంటూ ఆ సందర్భంగా హామీలు గుప్పించారని పేర్కొన్నారు.

మీ హామీల తో జీవితాలు మారిపోతాయని ఆశపడ్డారు. పే స్కేల్‌ అమలు చేస్తే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం వస్తుందని ఆశ పడ్డారు. పీఆర్సీ అమలు చేసినప్పుడల్లా జీతాలు పెరుగుతాయని భావించారు. ఇతర శాఖల్లోని ఉద్యోగుల తరహాలోనే పదోన్నతులు వస్తాయని ఆశించారు. మరీ ముఖ్యంగా ఉద్యోగానికి భద్రత ఉంటుందని భావించారు. కానీ మీరు యదావిధిగా మాటతప్పారు. ఉదారంగా హామీలు ఇవ్వడమే తప్ప, వాటిని అమలు చేసే చిత్తశుద్ధి మీకు ఎప్పుడూ లేదు. వీఆర్ఎల విషయంలో సైతం అదే ధోరణిని ప్రదర్శించారు. మాట ఇచ్చిన తప్పిన మీరే వీఆర్‌ఏల చావులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు.