గాంధీ భవన్ కు రాహుల్ రాక ఫై రేవంత్ ట్వీట్

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ లో రెండు రోజుల పర్యటన లో భాగంగా మొదటి సారి గాంధీ భవన్ కు వచ్చారు. ఈ సందర్బంగా రాహుల్ రాక ఫై పీసీసీ అధినేత రాహుల్ ట్వీట్ చేసారు. చారిత్ర‌క క‌ట్ట‌డంగా ఉన్న గాంధీ భ‌వ‌న్‌కు త‌మ నేత రాహుల్ గాంధీ తొలి సారి రావ‌డం సంతోషాన్నిచ్చింద‌ని స‌ద‌రు ట్వీట్‌లో రేవంత్ పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు ‘మైలీడ‌ర్ రాహుల్ గాంధీ’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా ఆయ‌న జ‌త చేశారు.

రాహుల్ రెండ్రోజుల తెలంగాణ టూర్‌ ముగిసింది. రెండో రోజు రాహుల్ బిజీబీజీగా గడిపారు. గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ వచ్చే ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమన్నారు. ఐక్యంగా ఉంటేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. కేసీఆర్‌ దగ్గర జన బలం లేదన్న రాహుల్.. ఎవరితోనూ పొత్తు ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. జనాల్లో ఉన్నోళ్లకే టికెట్లిస్తామని మరోసారి తేల్చి చెప్పారు రాహుల్. లీడర్లంతా హైదరాబాద్‌ వీడి, ఊళ్ల బాట పట్టాలన్నారు. ఢిల్లీ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక మీడియాతో ఏది పడితే అది మాట్లాడొద్దంటూ అల్టిమేటమ్‌ ఇచ్చారు.