రేపు కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీ..అగ్ర నాయకుల మధ్య విభేదాలు

రేపు నల్లగొండలో ర్యాలీపై తనను సంప్రదించలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

revanth-reddy-vs-uttam-kumar-over-nirudyoga-rally-in-nalgonda

హైదరాబాద్‌ః తెలంగాణ కాంగ్రెస్ లో అగ్ర నాయకుల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రేపు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై ఉత్తమ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. తనతో చర్చించకుండా, తన జిల్లాలో ఏ విధంగా సభ నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతోపాటు రేవంత్‌రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే, ముందుగా ప్రకటించిన విధంగానే నిరసన ర్యాలీలను కొనసాగించాలని రేవంత్ తెలిపారు. ఈ నెల 21న నల్లగొండలో, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్ లో నిరసన ర్యాలీలు జరుగుతాయని స్పష్టం చేశారు.