పంజాబ్ లో రైతుల కుటుంబాల‌కు కెసిఆర్ ఆర్థిక సాయం..రేవంత్ విమర్శలు

తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతుల ఆత్మహత్యలన్న రేవంత్
ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించర‌ని విమ‌ర్శ‌

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ కేసీఆర్ పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

”అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో! తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి… ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్ పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారు. మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా!” అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/