ప్రధాని పర్యటనపై సమాచారం లేదు..రేవంత్ రెడ్డి

స్థానిక పార్లమెంటు సభ్యుడిని పిలవకపోవడం సరికాదు

MP Revanth Reddy
MP Revanth Reddy

హైదరాబాద్‌: ప్రధాని మోడి కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించేందుకు నేడు హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందిస్తూ కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘గౌరవనీయులైన ప్రధాని మోడి గారు ఈ రోజు భారత్ బయోటెక్ కు రానున్నారు. హకీంపేట ఏఎఫ్ఎస్‌లో ఆయన ల్యాండ్ అవుతారు. అవి రెండు మల్కాజిగిరి నియోజక వర్గం కిందకు వస్తాయి. ఇక్కడ మోడి పర్యటన నేపథ్యంలో స్థానిక పార్లమెంటు సభ్యుడిని పిలవకపోవడం సరికాదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/