బోయిగూడ అగ్ని ప్రమాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి

అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి : రేవంత్

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ బోయిగూడ అగ్నిప్రమాదం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోయిగూడ తుక్కు పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు రేవంత్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/